Description
గ్రీకు పురాణ గాథల్లో పెర్సియస్, జేసస్, హెర్క్యులిస్ అన్న ముగ్గురు వీరులు సుప్రసిద్ధులు. వీరు ముగ్గురూ దైవాంశ సంభూతులని అంటారు. ఆయినా వారికి కష్టాలు తప్పవు. దేవతల మధ్య తగాదాల్లో కూడా వీరు నలిగిపోతుంటారు. కాని తమ అసమాన సాహసంతో, ప్రతిభతో, పట్టుదలతో, కొందరి దేవతల అనుగ్రహంతో వీరు తమ లక్ష్యాలను సాధిస్తారు.
ప్రాచీన నాగరికతలు ఉన్న అన్ని దేశాల్లోనూ, ప్రాంతాల్లోనూ పురాణ గాథలు ఉంటాయి. భారత దేశంలో ఇంద్రుడు ఉన్నట్లుగానే గ్రీకు గాథల్లో జూస్ ఉన్నాడు. రోమన్ పురాణాల్లో జూపిటర్ ఉన్నాడు. అతని అధీనంలో వివిధ దేవతలు వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు. మనుషులు వారికి రకరకాల నివేదనలు అర్పించి వారిని ప్రసన్నులను చేసుకోటానికి తిప్పలు పడుతూ ఉంటారు.
పెర్సియస్, జేసస్, హెర్క్యులిస్ల సాహస కథామాలికే ఈ పుస్తకం.




